తులసీ ఆకుతో మధుమేహాన్ని పొగట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. తులసీ ఆకుల్లోని ఆయుర్వేదంతో మధుమేహాన్ని తొలగించవచ్చునని అధ్యయనంలో తేలింది. తులసీ ఆకుల్లోని ఆక్సిమమ్ శాంగ్టమ్ (Ocimum sanctum) అనే పదార్థం షుగర్ను నయం చేసేందుకు ఉపయోగపడుతుందని అధ్యయనంలో తేలింది.
మధుమేహంలో భారతదేశంలో సుమారు నాలుగు కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. తులసీ ఆకుల రసం రక్తంలో కలవడం ద్వారా మధుమేహం నుంచి గుండె, కళ్లు, కిడ్నీ, నరాలు మరియు పాదాలను సురక్షితంగా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తులసీ ఆకులోని విశిష్ట ఆయుర్వేద గుణంతో మధుమేహాన్ని దూరం చేస్తుంది. ఇంకా తులసీ ఆకుల రసం రక్తంలో కలిసిపోతే శరీరంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇకపోతే.. ఆయుర్వేద చికిత్సలో తులసీనే ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నారు. తులసీలో యూజినాల్ అనే నూనె శక్తితో శ్వాస సంబధించిన వ్యాధులు మాయమవుతాయి. అలాగే తులసీ రసాన్ని తీసుకోవడం ద్వారా అలర్జీ, ఆస్తమా వంటివి కూడా తొలగిపోతాయని పరిశోధకులు అంటున్నారు.