తేలు కుట్టిన ప్రదేశంలో బాగా మంటగావుంటుంది. కొందరిలో వణుకు, చెమట విపరీతంగా పట్టటం, వాంతులు, విరేచనాలు కలగవచ్చు. తేలు కుట్టగానే బెత్తెడుపైన గట్టిగా గుడ్డతో కట్టు కట్టి , శరీరంలో విరిగిన ముల్లును జాగ్రత్తగా తీసివేయాలి.
కట్టును అరగంటకొకసారి తీసి, తిరిగి కట్టు కడుతుండాలి. లేకపోతే రక్త ప్రసరణ జరగక క్రింది భాగం చచ్చుబడిపోతుంది. కుంకుడుకాయ అరగదీసి వచ్చిన ఆ గంధాన్ని తీసి తేలు కుట్టిన చోట గాయం మీద రాసి, నిప్పు సెగ చూపితే విషం లాగేసి బాధనుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.
నొప్పి తీవ్రత ఎక్కువగావుంటే కుంకుడు గింజలోని పప్పును మింగితే విష ప్రభావం తగ్గుముఖంపడుతుంది. కుంకుడు గింజ ఆ సమయంలో తీయగావుంటుందని వైద్యలు తెలిపారు.
ఒక కప్పు నీటిలో ఒక చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ తగ్గిపోతుంది. అలాగే తేలు కుట్టినచోట జిల్లేడు పాలు అద్దినా కూడా విషం విరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. |