కొంతమంది అమ్మాయిలలో తమ వయసు దాటిపోతున్నాకూడా రజస్వల కాకుండా మిగిలి పోతుంటారు. దీంతో అమ్మాయిలకన్నా తల్లిదండ్రులకు ఎక్కువ ఆందోళన ఉంటుంది. అలాంటి వారికి ఓ చిన్ని చిట్కావుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
అమ్మాయిలు రజస్వల కాకుంటే ప్రతి రోజూ తెల్ల మద్ది చెట్టుపూలు పదివరకు సంపాదించి మెత్తగా నూరి అందులో తేనె లేక పంచదార కలిపి తినిపించండి. మద్దికాయలకుకూడా ఇదే గుణంవుందంటున్నారు వైద్యులు. వీటిలో ఋతుస్రావం అయ్యేలా చేసే గుణంవుందని వారు పేర్కొన్నారు.
కొంతమంది స్త్రీలలో నెలల తరబడి నెలసరి ఆలస్యం అవుతున్నవారుకూడా ఈ ఉపాయాన్ని పాటించవచ్చు. ఇది బజారులో దొరికే వస్తువుకాదు. పల్లెల్లో తెల్లమద్ది శులభంగా దొరుకుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. |