మనిషి బుద్ధిజీవి. ప్రతి చిన్న విషయంకూడా గుర్తుంచుకునే తత్వం కేవలం ఒక్క మనిషికే ఇచ్చాడా దేవుడు. నిజంగా ఇది ఒక వరంలాంటిది. అలాంటిది కొన్ని కొన్ని సందర్భాలలో మరుపు అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా విద్యార్థులు, వయసు పై బడినవారిలో మతిమరుపు ఎక్కువగా ఉంటే కళ్యాణక చూర్ణం వాడాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
** కళ్యాణక చూర్ణం వాడితే జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. కోరుకున్న విషయంపై మనసు లగ్నం అవుతుందంటున్నారు వైద్యులు.
** మానసిక అవలక్షణాలు, ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుంది. ప్రత్యేకంగా వృద్ధాప్యంలోనున్నవారు ఈ ఔషధాన్ని వాడితే వారిలో కలిగే అవలక్షణాలను నిరోధిస్తుంది.
అలాగే జీర్ణశక్తికూడా బాగుంటుందని వైద్యులు సూచిస్తున్నారు. కళ్యాణక చూర్ణంలో మెదడుని పోషించే గుణాలు అధికంగా ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. |