ప్రస్తుతం కాలంలో చుండ్రు ఏర్పడటం సహజాతి సహజం అయిపోయింది. పని ఒత్తిడి.. వాతావరణ కాలుష్యం వంటి కారణాలతో ఒక అలర్జీలా ఏర్పడి అది తలలో చుండ్రు వచ్చేందుకు కారణమవుతోందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు.
తలలో మాడుపై వచ్చే చుండ్రు మరింత ఇబ్బందికి గురిచేస్తుంటుంది. ముఖ్యంగా స్త్రీలకైతే వెంట్రుకలు రాలి పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయని నిపుణులు పేర్కొన్నారు. ఇలాంటప్పుడు అలోవీరా జెల్ చుండ్రును నివారించడంలో ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ప్రతి రోజు తల స్నానం చేసే ఓ పదిహేను నిమిషాల ముందు తలకు సరిపడేంత అలోవీరా జెల్ను బాగా పట్టించి ఆ తర్వాత స్నానం చేయాలి. ఈ విధానాన్ని ప్రతిరోజు పాటించినట్లైతే ఫలితం ఉంటుందని నిపుణులు వెల్లడించారు.
|