మానవ శరీరంలో సూక్ష్మ జీవులు రెండు రకాలుగా ఉపయోగపడుతాయి. అది ఒకటి శరీరానికి మేలు చేసేవికాగా రెండవది శరీరానికి చెడు చేసేవిగా ఉంటాయి. వీటి సంఖ్య కొన్ని వేలు ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
మనం తీసుకునే ఆహారంలో జీర్ణం కాని పదార్థాలను ఈ సూక్ష్మ క్రిములు ఉపయోగించుకుంటాయి. మేలు చేసే ఈ సూక్ష్మక్రిములు శరీరంలో చేరే హానికర సూక్ష్మ జీవులను నియంత్రిస్తుంది.
శరీరానికి హాని చేసే సూక్ష్మ జీవులను సంహరించి రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరచడంలో మేలు చేసే సూక్ష్మ జీవులు సహాయ పడతాయి. వీటి సంఖ్యను పెంచేగుణం బాదం పప్పులకుంది.
బాదం పప్పులను మెత్తగా నూరి ఆ పొడిని ప్రతి రోజు ఒక చెంచా తమ ఆహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బాదం పప్పులోనున్న లిపిడ్స్ని సూక్ష్మ జీవులు వాడుకుని తమ సంఖ్యను పెంచుకుంటాయని వైద్యులు తెలిపారు. |