మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఐదునుంచి పది గ్రాముల నేరేడు గింజల చూర్ణాన్ని ఉదయంపూట సేవించాలి. కాకారకాయ రసం సేవిస్తే కూడా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు.
రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. తద్వారా శరీర బరువు పెరగకుండా చూసుకోవాలి. భోజనానికి అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి.
మందులు వేసుకోవడంలో సమయ పాలన లేకపోతే శరీరంలో అపసవ్య స్థితి ఏర్పడుతుంది. ప్రతి రోజూ ఒక నిర్ణీత సమయంలోనే భోజనం చేయాలి. ఇన్సులిన్ వేసుకోవడంలోనూ సమయాన్ని పాటించాలంటున్నారు వైద్యులు.
మధుమేహంలో కాళ్లల్లో స్పర్శజ్ఞానం పోయిందన్న విషయం చాలాకాలం వరకు తెలియదు. అందుకే వారు ఏటా ఒకసారి పాదాల్లో స్పర్శ ఎలా ఉందో తెలుసుకోవాలి. స్పర్శ లేకపోతే ప్రతి ఆరుమాసాలకు వీలైతే మూడు మాసాలకు ఒకసారి పరీక్ష చేయించుకోవాలంటున్నారు వైద్యులు. |