మర్రిచెట్టు కాండం బెరడు మధుమేహాన్ని అదుపులో పెడుతుంది. 100 గ్రాముల మర్రిచెట్టు బెరడును 3 కప్పుల నీళ్లలో 24 గంటలపాటు నానబెట్టి బెరడు నుంచి రసం పిండి కప్పు మోతాదుగా రెండు పూటలా పుచ్చుకుంటూ ఆహార వ్యాయామ నియమాలను పాటించాలి.
చెంచాడు మెంతులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం నీళ్లతో సహా మింగేయాలి. నల్లనేరేడు గింజలు, మారేడు ఆకుల పొడి అర చెంచాడు చొప్పున, పసుపు, ఉసిరి పెచ్చుల పొడి చెంచాడు అన్నిటినీ బాగా కలిపి ఆ మిశ్రమాన్ని రెండు పూటలా నీళ్లతో తీసుకోవాలి.