సాయంత్రమైతే కొందరికి చూపు మందగిస్తుంది. ఇలా చూపు మందగిస్తుంటే దీనిని రే చీకటి అంటారు. దీనికి సరైన చికిత్సా పద్ధతులను పాటిస్తే ఈ వ్యాధి నుంచి సులభంగా భయటపడవచ్చంటున్నారు వైద్యులు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ ఏ లోపించడం వల్లనే ఈ వ్యాధి వస్తుందంటున్నారు వైద్యులు.
రే చీకటి అనే వ్యాధి నుంచి బయటపడేందుకు నిత్యం మనకు లభించే ఆహార పదార్థాల ద్వారానే ఈ వ్యాధిని నయమ చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో ప్రధానంగా క్యారెట్, బొప్పాయి, టమోటా, గుమ్మడికాయ, మామిడి, కోడి గుడ్డు, వెన్న, చేప నూనె తదితర ఆహారపదార్థాలలో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది.
మీరు తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలుండేలా చూసుకోండి. దీంతో మీరు రేచీకటిని పారద్రోలేందకు ప్రయత్నించగలరు.