ప్రతి రోజూ మనిషి శరీరానికి ఆహారం తప్పనిసరి. ఆ ఆహారం తిన్న తర్వాత జీర్ణం కాకపోతే మాత్రం ఆరోగ్యం చాలా ఇబ్బందిగా మారిపోతుంది. దీంతో పలు వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి ఓ చిన్ని చిట్కాను పాటిస్తే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
ప్రత్యేకంగా రాత్రిపూట ఏ కూర తిన్నా తినకపోయినా అల్లం, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లితో తయారు చేసిన మిరియాల చారును కలుపుకుని అన్నం తింటే జీర్ణశక్తి మెరుగుపడుతుందని ఆయుర్వేద వైద్యులు తెలిపారు.
రాత్రిపూట మీరు తినే ఆహారంలో అన్నం తక్కువ చారు ఎక్కువగా వేసుకొని తింటే జీర్ణకోశ సంబంధమైన అన్ని బాధలు తొలగిపోతాయి. దీంతో జీర్ణశక్తి వృద్ధి చెంది బాగా ఆకలవుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.