చాలామంది ఊబకాయంతో బాధపడుతుండేవారు ఎక్కువగా చపాతీలు తింటుంటారు. ఈ చపాతీలు తినడం మాని జొన్న రొట్టెలు, సద్దల పిండితో చేసిన రొట్టెలు ఆహారంగా తీసుకోవడం ప్రారంభించండి. దీంతో కేవలం మీ ఉదరంలో పేరుకుపోయిన కొవ్వు, నడుము వద్ద పేరుకుపోయిన కొవ్వు మాత్రమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఉదయం ఒక గ్లాసు చల్లటి నీటిలో రెండు చెంచాల తేనె కలుపుకుని సేవిస్తే కొద్ది రోజులకు ఊబకాయం తగ్గిపోతుంది. సన్నగా తయారయ్యేందుకు పాలు, నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకుంటుండండి. లేకుంటే శరీరంలో బలహీనత పెరిగి, వాతవికారం, మోకాళ్ళలో నొప్పులు, గ్యాస్ ట్రబుల్ తదితర జబ్బులు వస్తాయనడంలో సందేహం లేదు.