అధిక బరువుతో బాధపడుతున్నా వారు తమ శరీర బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని ద్రాక్షపండ్ల రసం తాగితే బరువు తగ్గి నాజూకుగా తయారవుతారంటున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లరసం తాగాలనిపించినప్పుడల్లా ద్రాక్షరసం తాగటం మంచిది. ఈ పండ్ల రసంలో మిగిలిన పండ్లకన్నా తక్కు వ కాలరీలు ఉంటాయి.
ద్రాక్ష రసంలో పంచదార వేసుకోకుండా తాగటం ఎంతో మంచిది. ఇందులో ఉన్న పీచుపదార్థం ఈ రసాన్ని ఎక్కువసేపు కడుపులో నిలిపి ఉంచుతుంది. దీంతో ఆకలి తగ్గి ఆహారం ఎక్కువగా తినలేరు.
ద్రాక్షలో ఉండే పీచుపదార్థం వలన శరీరంలో కొవ్వును చేరనివ్వదు. ద్రాక్షరసంలో పంచదార వేసుకోకుండా తాగితే మరిన్ని తక్కువ క్యాలరీలు శరీరంలోకి చేరతాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్టరాల్ని శరీరంలోకి చేరనివ్వవు. దీంతో శరీరం నాజూకుగా తయారవుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.