దేశ వైద్య చరిత్రలోనే తొలిసారిగా ఆరు రోజుల శిశువుకు పేస్మేకర్ను పూనేలోని జహంగీర్ ఆసుపత్రి వైద్యులు అమర్చారు. ఇటువంటి పరిస్థితిని అప్పుడే పుట్టిన శిశువులు ఎదుర్కొనడం చాలా అరుదైన విషయంగా జహంగీర్ ఆసుపత్రి హృద్రోగ విభాగాధిపతి డాక్టర్ జేఎస్ దుగ్గల్ మీడియాతో అన్నారు.
గుండె యొక్క పంపింగ్ రేటును నియంత్రించే హృదయ కండర వ్యవస్థలో తలెత్తిన వైఫల్యంతో శిశువులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని దుగ్గల్ తెలిపారు. దీంతో గుండెలో అవరోధం చోటు చేసుకోవడంతో ఆరురోజుల శిశువుకు తొలుత వెంటిలేటర్ను అమర్చినట్లు వెల్లడించారు.
అయినప్పటికి శిశువు ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు చోటు చేసుకోకపోవడంతో శాశ్వత పేస్మేకర్ను శిశువుకు ఏర్పాటు చేసినట్లు దుగ్గల్ పేర్కొన్నారు.
|