|
ఐటీ నిపుణులుకు పొంచి ఉన్న వెన్ను నొప్పి
|
|
|
|
|
|
కొచ్చిన్ (ఏజెన్సీ), సోమవారం, 7 జనవరి 2008( 17:00 IST )
|
|
|
|
|
|
|
|
|
|
|
| | ఆధునిక జీవనశైలి, ఒత్తిడికి గురిచేస్తున్న పనిభారంతో ఐటీ నిపుణులు అత్యధికంగా వెన్ను నొప్పి సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ హీ హ్వాన్ టక్ తెలిపారు. లేక్షోర్ ఆసుపత్రిలో 47 సంవత్సరాల వ్యక్తికి అత్యంత ఆధునాతన పద్థతిలో డిస్క్ మార్పిడి శస్త్ర చికిత్సను నిర్వహించే నిమిత్తం డాక్టర్ టక్ ఇక్కడకు వచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆధునాతనమైన ఆహారపు అలవాట్లు మరియు కార్యక్షేత్రంలో పనితీరుతో వెన్నెముక పనితీరులో కీలకపాత్ర పోషించే డిస్క్-సంబంధిత సమస్యలను ఐటీ నిపుణులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు.
డాక్టర్ టక్తో పాటు శస్త్రచికిత్సలో పాలుపంచుకునేందుకు వచ్చిన డాక్టర్ సురేష్ పిళ్లై మాట్లాడుతూ అధ్వాన్నమైన రహదారులు, ఆహారంలో పోషక పదార్థాల లోపంతో దేశంలో వెన్నెముకకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోందని అన్నారు.
|