యోగాలోని ప్రాణాయామంతో స్వైన్ఫ్లూ, క్యాన్సర్లాంటి మహమ్మారి వ్యాధులను నయం చేసే గుణం ఉందని ప్రముఖ యోగా గురువు స్వామీ రాందేవ్ అన్నారు.
దేశీయ యోగాను ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసేందుకు తాను కృతనిశ్చయంతో ఉన్నానని, టోరంటోలో ఓ శాంతి కేంద్రాన్ని స్థాపించాలని ఆయన అన్నారు. సోమవారంనాడు కెనడాలో జరిగిన పియర్సన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
యోగా అనేది ఓ మహత్తరమైన ప్రక్రియ అని, ఇది స్వైన్ఫ్లూ, క్యాన్సర్, ఎయిడ్స్ లాంటి పలు జబ్బులను నయం చేస్తుందని ఆయన వివరించారు.
యోగా అనేది శాస్త్రీయమైనదని, మనిషి తన నిజ జీవితంలో ఆత్మ నియంత్రణ వలన ఎలాంటి వ్యాధినైనా పారద్రోలవచ్చని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యోగాలోని కొన్ని క్రియలను ఆయన ప్రజలకు చేసి చూపించారు.