సమాజంలో వేరు వేరు కుటుంబాలనుంచి వచ్చిన ఇద్దరు స్త్రీ, పురుషులు జీవితాంతం కలిసి ఉండడానికి నిర్థేశించినదే వివాహం. వివాహం వల్ల స్త్రీ, పురుషులు దంపతులుగా మారుతారు. అయితే ఇద్దరు స్త్రీ పురుషులు దంపతులైనంత మాత్రాన వారి దాంపత్యం విజయవంతమైనట్టు కాదు. వారు జీవితాంతం ఎలాంటి స్పర్థలు లేకుండా కలిసి జీవించగల్గితేనే వారి దాంపత్యం బంధం విజయవంతమైనట్టు చెప్పగలం.
ఇలా విజయవంతం అయిన దాంపత్య బంధం మరెందరికో ఆదర్శమవుతుంది. అయితే నేటి ఆధునిక యుగంలో ఎక్కువ సంఖ్యలో దంపతులు మధ్యలోనే తమ బంధాన్ని తెంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇందుకు కారణాలేంటి అని తరచి చూస్తే చాలా విషయాల్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
భార్యభర్త మధ్య అనుమానాలు, భర్త దురలవాట్లు ఇలా అనేక కారణాలు చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని రకాల కారణాలు చెప్పుకున్నా ప్రధానంగా భార్యాభర్త మధ్య ఏర్పడే అవగాహనా రాహిత్యమే దాంపత్య బంధం విచ్ఛిన్నానికి దారితీస్తుందన్నది నిస్సందేహం.
|