** అధికరక్తపోటుతో బాధపడుతున్నవారు అధిక మోతాదులో భోజనం తీసుకోవాలి. అలాగే ఘనమైన ఆహార పదార్థాలనుంచి దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.
** మీరు తీసుకునే భోజనంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలుండేలా చూసుకోవాలి.
** ఉల్లిపాయలు, సగ్గుబియ్యం, సోయాబీన్, వెల్లల్లినికూడా మీరు ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
** మీరు తీసుకునే భోజనంలో పొటాషియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా సోడియం తక్కువగా ఉండాలి. ఉప్పును తక్కువగా ఉపయోగించండి.
** డైరీ ఉత్పత్తులు, చక్కెర, రిఫైన్డ్ ఆయిల్తో చేసిన ఆహార పదార్థాలు, వేపుళ్ళు, కెఫిన్, జంక్ ఫుడ్ లాంటివి తీసుకోకూడదంటున్నారు వైద్యులు.
** రోజుకు కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీటిని తప్పనిసరిగా సేవించాలి.
** తక్కువ మోతాదులో సజ్జలు, గోధుమలు, జొన్నలు. వీటి పిండితో తయారుచేసిన రొట్టెలు, పెసలపప్పు, సగ్గుబియ్యం, మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
** పాలాకు, గోబీలాంటి ఆకుకూరలను కూడా ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు.
** కాయగూరలలో సొరకాయ, నిమ్మకాయ, బీరకాయ, పుదీనా, గుమ్మడికాయ, కాకరకాయ, దొండకాయలను తీసుకోవాలి.
** వాము, ఎండు ద్రాక్షపండు మరియు అల్లంను సేవిస్తే ఈ వ్యాధిబారినపడినవారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది.
** పండ్ల విషయానికి వస్తే ఋతువులననుసరించి వచ్చే పండ్లు, బొప్పాయి, దానిమ్మ, చీని, జామ, ద్రాక్ష తదితర పండ్లుకూడా తీసుకోమని వైద్యులు సూచిస్తున్నారు.
** మీగడలేని పాలు, మజ్జిగ, సోయాబీన్ నూనె, ఆవు నెయ్యి, బెల్లం, తేనె తదితరాలు సేవించవచ్చంటున్నారు వైద్యులు. |