జలుబుతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం పిండుకుని ఆ నీటని నోట్లో వేసుకుని గరగరలాడించండి. ఆ తర్వాత మిగిలిన నీటిని కొద్దికొద్దిగా సేవించండి.
తులసి ఆకులు, పుదినా ఆకులు, అరచెంచా అల్లం, బెల్లం, రెండుకప్పుల నీటిలో ఉడకబెట్టండి. దీనిని వడకట్టి అందులో నిమ్మకాయ రసం కలుపుకుని సేవించండి. దీంతో జలుబు మటుమాయం అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. |