నిద్రలేమితో బాధపడుతుంటే ఒక చెంచా సోంపు పొడిని ఓ కప్పులో వేసి మరిగించుకోండి. గోరువెచ్చగా మరిగిన తర్వాత ఇందులో తేనె కలుపుకుని రాత్రి పడుకునే ముందు సేవించండి. ఇలా తీసుకోవడం వలన సుఖవంతమైన నిద్ర వస్తుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
సోంపు వాడటం వలన అధిక రక్తపోటును అదుపులోకి తీసుకువస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు సోంపు తీసుకుంటుంటే రక్తపోటు అదుపులోకి వస్తుందంటున్నారు వైద్యులు.