** శరీరం వేడి చేసి కొందరికి తరచూ ముక్కు నుంచి రక్త కారుతుంటుంది. ఇలాంటి వారిని ఓ కుర్చీలో కూర్చోబెట్టి తలను వెనక్కు మళ్ళించండి. రోగిని నోటి ద్వారా శ్వాస తీసుకోమని చెప్పండి. కర్పూరాన్ని నెయ్యిలో కలిపి రోగి నుదిటిపై రాయండి. దీంతో ముక్కు నుంచి రక్తం తగ్గి ఉపశమనం కలుగుతుంది. రక్తం కారడం తగ్గిన తర్వాత సుగంధభరితమైన సెంటును వాసన చూపించండి.
** వేడి చేసి తలనొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో అల్లం, నిమ్మకాయ రసం కాసింత ఉప్పును కలిపి సేవిస్తే తలనొప్పి తగ్గి ఉపశమనం కలుగుతుంది.