నిత్యం కంప్యూటర్తో పని చేసేవారు ఇప్పుడు ఎక్కువైపోతున్నారు. ఇలాంటివారు తమ ఆరోగ్యంపట్ల కాస్త శ్రద్ధ వహిస్తే బాగుంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు వైద్యులు.
** మీరు కంప్యూటర్తో పని ప్రారంభించిన తర్వాత ప్రతి రెండు గంటలకు ఒకసారి కనీసం రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా కూర్చోండి.
** కళ్ళ క్రింద యాంటీ వ్రింకల్ క్రీమ్ రాయండి. దీంతో కళ్ళక్రింద త్వరగా ముడతలు, నల్లటి మచ్చలు ఏర్పడవు.
** యాంటీ వ్రింకల్ క్రీంలో రెటీనాల్, విటమిన్ సి, గ్రీన్ టీ ఎక్స్ట్రాట్లు ఉంటాయి. ఇవి కళ్ళక్రింద మెలెనిన్ రాకుండా కాపాడుతుంది.
** ఆరోగ్యకరమైన చర్మం కోసం యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడండి.
** యాంటీ ఆక్సిడెంట్ క్యాప్సూల్ వాడటం వలన శరీరంలోని విషపూరితమైన పదార్థాలు బయటకు విసర్జించబడుతాయి.
** కళ్ళకు పూర్తి విశ్రాంతినివ్వాలి. దీంతో దాదాపు ఎనిమిది గంటల సమయం మీరు తప్పనిసరిగా నిద్రపోవాలి. అలా నిద్రపోయినప్పుడే కళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటుంది.
** నిత్యం అండర్ ఐ జెల్ను ప్రయోగించండి దీంతో మీ కళ్ళు ప్రకాశవంతంగా ఉంటాయంటున్నారు వైద్యులు.