ఆరోగ్యమే మహాభాగ్యం అనిమన పెద్దలు చెప్పిన సూక్తి. నాగరికత పెరిగి, సాంకేతిక అభివృద్ది సాధించిన మానవుడు తన జీవితం సుఖమయమైందని భావించాడు. శారీరక శ్రమ తగ్గడమే సుఖం అని భావించాడు.
కాని ఆధునిక జీవన విధానం మనిషికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలనుండి కాస్త ఉపశమనం కలగాలంటే వ్యాయామం చేయాలంటున్నారు వ్యాయామ పరిశోధకులు.
మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను బయటకు పంపాలంటే శ్వాస క్రియ మూల కారణం అంటున్నారు వారు. దీనికి అనులోమ విలోమ యోగాసనం చేయమంటున్నారు నిపుణులు.
పద్మాసనంలో కూర్చుని కుడిముక్కు మూసుకుని ఎడమ ముక్కుతో గాలి పీల్చి వదలాలి. తర్వాత రెండు ముక్కులు మూసుకుని కొద్దిసేపు పట్టుకోవాలి. ఆ తర్వాత ఎడమ ముక్కు మూసుకుని కుడి ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి.
ఇలా చేస్తే శరీరంలో పేరుకున్న మలినాలను తొలగిస్తుంది. శ్వాస, రక్త ప్రసరణ బాగా జరిగి, నాడీ వ్యవస్థలను మెరుగుపరుస్తుందంటున్నారు యోగా నిపుణులు.
అధిక రక్త పోటున్నవారు శ్వాసను ఆపడం చేయకూడదని అంటున్నారు యోగా నిపుణులు. |