దాదాపు 50 సంవత్సరాల అనంతరం సునీల్ గవాస్కర్ రూపంలో ప్రముఖ బ్యాట్స్మెన్ మరియు కపిల్ దేవ్ రూపంలో ప్రముఖ బౌలర్లు భారత జట్టులో స్థానం సంపాదించారు. అప్పటినుంచి టెస్టులలోనూ మరియు ఒకరోజు అంతర్జాతీయ క్రికెట్ (వన్డే క్రికెట్)లోనూ భారత జట్టు ప్రదర్శన పూర్వం కంటే బాగుపడింది.
ఇదే క్రమంలోనే పైన మనం చెప్పుకున్నగా... 1983లో కపిల్ దేవ్ నాయకత్వంలో 3వ ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటులో అప్పటి విశ్వవిజేత అయిన వెస్టిండీస్ జట్టును ఫైనల్లో బోల్టా కొట్టించి అపూర్వమైన విజయాన్ని భారత క్రికెట్ జట్టు సాధించింది. ఆ మరుసటి సంవత్సరమే సునీల్ గవాస్కర్ నేతృత్వంలో ఆసియా కప్ క్రికెట్ను కూడా భారత జట్టు సాధించింది.
ఇదిలా ఉంటే... భారత జట్టు తొలి ప్రపంచకప్ను సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2008వ సంవత్సరంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు "కపిల్ సేన"ను ఘనంగా సత్కరించింది. ఆనాటి మేటి విజయంలో పాలు పంచుకున్న భారత జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడికి తలా 25 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా బీసీసీఐ బహూకరించింది.
ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆనాటి టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్, తన జట్టు సభ్యులందరికీ పేరు పేరునా అభినందనలు తెలియజేశాడు. ఈ కార్యక్రమంలోనే "కపిల్ డేర్ డెవిల్స్" బృందం ఆటగాళ్లంతా కలిసి వజ్రాలు పొదిగిన బ్యాటును ఆవిష్కరించిన సంగతి పాఠకులకు విదితమే...! |