ప్రధాన పేజి > ఇతరాలు > సాహిత్యం > కళలు మరియు సంస్కృతి > ఘనంగా "శత వసంతాల శ్రీశ్రీ" సభ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఘనంగా "శత వసంతాల శ్రీశ్రీ" సభ
ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో.. విజయవాడలోని స్వాతంత్ర్య సమరయోధుల సంఘం భవనంలో "శత వసంతాల శ్రీశ్రీ" సభ ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్యవక్తగా పాల్గొన్న వరవరరావు మాట్లాడుతూ... విప్లవ రచయితలకు శ్రీశ్రీయే స్ఫూర్తిదాయకం అని అన్నారు.

చైనా యుద్ధ కాలంలో అప్పటి ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపించి సీపీఎం, సీపీఐ నాయకులను అణచివేయాలన్న ఉద్దేశ్యంతో ముందస్తు అరెస్టు చట్టాన్ని అమలు చేసిందని వరవరరావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఏకే గోపాల్‌ను అరెస్టు చేయడం, భూమయ్య, కిష్టయ్య గౌడ్‌లను ఉరితీయడం లాంటి సంఘటనలు జరిగాయని ఆయన అన్నారు.

అలాంటి సమయంలోనే... ప్రభుత్వ దుర్మార్గ చర్యలను అడ్డుకోవాలని కోరుతూ శ్రీశ్రీ విప్లవోద్యమాన్ని నిర్మించారని వీవీ పేర్కొన్నారు. శ్రీకాకుళంలో పుట్టిన నక్సల్‌బరీ ఉద్యమాన్ని మరింతగా బలోపేతం చేసేందుకుగానూ శ్రీశ్రీ కళింగ నుంచి కర్ణాటకదాకా పర్యటించారని తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రముఖ రచయిత్రి కమలాదాస్ అస్తమయం
మన భారతీయులకే ప్రత్యేకం... బొట్టు
మహాకవి "శ్రీశ్రీ"కి ఘన నివాళులు
టిప్పు సుల్తాన్ సింహాసన ఛత్రం అమ్మకం
షేక్స్‌పియర్ కేంద్రానికి మంగేష్ కానుక
సెప్టెంబరులో తెలుగు చైతన్యయాత్ర : యార్లగడ్డ