నేను డాక్టరుగా చాలా సమావేశాలకు హాజరయ్యేవాడిని. అలా అవయవ మార్పిడికి సంబంధించి ఓ సమావేశంలో ప్రసిద్దవైద్యుడు చేరనయ్య కలిశాడు. అపుడు మామధ్య అవయవ మార్పిడి గురించిన చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్య శాస్త్రం ఈ అంశంపైనే తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆ సమయంలో ఆయన ఈ విషయం చెప్పాడు. డా. చేరనయ్య దేశంలోనే ప్రముఖుడైన హ్రుద్రోగనిపుణుడు.
ప్రస్తుతం పాకిస్తాన్లో కూడా ఆయన స్వచ్చందంగా తన వైద్యసేవలందిస్తున్నారు. మన దేశంలో గుండెమార్పిడి చేసిన తొలి డాక్టర్ ఆయన. ఇక్కడ గుర్తించవలసిన అంశం ఏమిటంటే.. యాదృశ్చికంగా జరిగిన సంఘటన. మానవత్వానికీ, మంచితనానికీ ప్రేరణగా నిలిచిన సంఘటన కావడం. సరే, విషయానికి వస్తాను. డాక్టర్ తొలి గుండే ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.
ఓ మహిళకు గుండె మార్పిడి అత్యవసరంగా జరిపించాలి. దేశంలో అన్ని ప్రధాన నగరాలలోనూ దాతకోసం వెదుకుతున్నారు.. ఫలితం కనిపించలేదు. అపరేషన్ తేదీ దగ్గరపడింది. రోగికి ప్రాణాపాయం పెరిగిపోతోంది. ఏంచేయాలో పాలుపోలేదు. ఇలా ఉండగా ఓ రోజు రాత్రి పదకొండు గంటలకు చేరనయ్య ఉంటున్న ఊరిలోని ఆసుపత్రినుండే ఫోను వచ్చింది.
ఒక ప్రమాదంలో గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న ఒక మహిళ గుండె దానం చేయడానికి ఆమె భర్త అంగీకరించినట్టు వార్త. ఇది విన్న చేరనయ్య ఆనందపడ్డాడు. దేశంలో గుండెమార్చే ఆపరేషన్ చేసే తొలి వ్యక్తిగా నిలువనున్నందుకు సంతోషించాడు. మరునాడు ఉదయమే సంబంధిత వ్యక్తులతో మాట్లాడాడు. చట్టపరమైన ఇబ్బందులను తెలిపాడు.
అయితే మరణిస్తున్న తన భార్య శరీరావయవాలు మరొకరికి జీవితాన్ని ప్రసాదించడం తనకు ఎంతో గర్వకారణం అని అతనన్నాడు. ఆపరేషన్ పూర్తయింది, రోగి కోలుకుని మరో పదేళ్లు బ్రతికింది. అర్థం కానట్టు రఘుపతి వైపు చూశాను. చెబుతానని, చేత్తో సైగ చేసి... ఇంతకూ ఈ విషయంలో విశేషం ఏమిటని కదూ నీ చూపులకర్ధం అన్నాడు. తల ఊపాను ఓ క్షణం ఆగి, చేతితో నా చేయిపై తట్టి.... గుండె ఆపరేషన్ చేయించుకున్న మహిళ ముస్లీం. ఆమెకు తన గుండె దానం చేసిన స్త్రీ హిందువు. ఈ అపరేషన్తో చరిత్ర సృష్టించిన వైద్యుడు క్రిస్టియన్. మతం మానవత్వానికి అడ్డుకాదు అనడానికి ఇది నిదర్శనం. అన్నాడు.
నా కళ్లు చెమ్మగిల్లాయి. మరి మతంకోసం మారణకాండ సృష్టించడం ఎలా సాధ్యం.. ఆలోచిస్తున్నాను. . . . టైం అయిపోయింది.. నేను వెళతానురా, అంటూ.. రఘుపతి బయలుదేరాడు. |