ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ఎన్.ఆర్.ఐ. మహిళలు > జుమా మంత్రివర్గంలోకి మరో ఎన్నారై
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జుమా మంత్రివర్గంలోకి మరో ఎన్నారై
దక్షిణాఫ్రికా నూతన అధ్యక్షుడు జాకబ్ జుమా భారత సంతతికి చెందిన మరో నేతను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. వర్ణ వివక్ష వ్యతిరేక ఉద్యమకారిణి మాగీ గోవెండర్ (50) చేరికతో జాకబ్ కేబినెట్‌లోని భారత సంతతి మంత్రుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

క్వాజులూ-నటల్ ప్రావిన్స్ కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖా మంత్రిగా గోవెండర్‌కు జాకబ్ జుమా బాధ్యతలు అప్పగించారు. కాగా... మంత్రివర్గంలో తనకు స్థానం కల్పించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేస్తూ, అధ్యక్షుడు తనపై విశ్వాసం ఉంచి అప్పజెప్పిన అత్యంత కీలకమైన మంత్రి పదవికి పూర్తి న్యాయం చేకూరుస్తానని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే... డర్బన్‌కు చెందిన మాగీ వృత్తరీత్యా విద్యావేత్తగానే కాకుండా, నాటల్ ఇండియన్ కాంగ్రెస్ మాజీ అధికారిణిగా, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్‌తో పాటు మరికొన్ని సంస్థలతో కలసి వర్ణవివక్షపై ఎనలేని పోరాటం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
రూబీపై ఎలాంటి కుట్ర జరగలేదు : కెన్నడీ
తెలుగు విద్యార్థిని నిఖితకు జీవశాస్త్ర అవార్డు
పుత్రుడి చదువు కోసం భారతీయ మహిళ ఇక్కట్లు
మరో వివాదంలో చిక్కుకున్న రూబీ ధల్లా
దక్షిణాఫ్రికాకు ముగ్గురు "ప్రథమ మహిళలు"
తమిళ నటి సుజాత కేసు మరింత జటిలం