ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చేపట్టిన అంతర్జాతీయ ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని సినీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సోమవారం ప్రారంభించారు. విదేశాల్లో నివశిస్తున్న తెలుగు ప్రజల పిల్లలకు తెలుగు సంస్కృతి, సంప్రదాయం, జీవన శైలిని తెలిపేందుకు వీలుగా. తానా ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
విదేశాల్లో పుట్టి పెరిగిన ఐదుగురు విద్యార్థులను అంతర్జాతీయ ఇంటర్న్షిప్ కోసం రాష్ట్ర రాజధానికి పంపింది. వీరు 40 రోజుల పాటు హైదరాబాద్లో వుండి తమకు కేటాయించిన వివిధ అంశాలపై అధ్యయనం చేస్తారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ.. ఇంటర్న్షిప్కు ఎన్నికైన విద్యార్థులు అధ్యయనం కంటే.. ఇక్కడి ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడమే అతి ముఖ్యమన్నారు.
|