మలేషియాలోని భారత వాణిజ్యవేత్తల కోసం ఆ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. భారతీయుల వాణిజ్య ప్రయోజనాల కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశామని మలేషియా ఉపప్రధాని సజీబ్ రజాక్ తెలిపారు.
ఈ సందర్భంగా రజాక్ విలేకరులతో మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కమిటీ ప్రభుత్వం, భారతీయుల మధ్య వారధిగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
మలేషియాలోని ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం ఈ కమిటీ కృషి చేస్తుందని వివరించారు. మలేషియన్ అసోసియేటెడ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఏమ్ఏఐసీసీ) నిర్వహించిన ఈ కార్యక్రమంలో రజాక్ పాల్గొన్నారు.
|