గల్ఫ్ దేశాల్లో భారత హస్తకళలకు ప్రాచుర్యం కల్పించేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దుబాయ్ వచ్చిన జౌళి శాఖ మంత్రి శంకర్ సింగ్ వాఘేలా భారత హస్తకళల ఎగుమతి మండలి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ అంశానికి సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై ప్రత్యేక దృష్టి సారించామని ఆయన వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో అమ్ముడయ్యే వస్తువుల ద్వారా భారత్లోని హస్తకళాకారులు ఆదాయం పొందుతున్నారని వివరించారు. హస్తకళలను కొనుగోలు చేసి వారికి జీవనోపాధి కల్పించాలని సభికులనుద్ధేశించి ఆయన అన్నారు.
|