భారత్కు చెందిన రాజేంద్ర కుమార్ పచౌరీ వరుసగా రెండో సారి ఐరాస పదవికి ఎంపికయ్యారు. ఇంటర్ గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (ఐపీసీసీ)కి ఆయన ఛైర్మన్గా నియమితులయ్యారు.
జెనీవాలో జరిగిన ఐపీసీసీ ప్లీనరీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ది ఎనర్జీ రిసోర్స్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ)కి పచౌరీ ప్రస్తుతం సారథ్యం వహిస్తున్నారు. 2002లోనే పచౌరీ ఈ పదవీ బాధ్యతలు చేపట్టారు.
గత ఏడాది అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు ఆల్ గోరెతో కలసి ఐపీసీసీ సంస్థ నోబెల్ శాంతి బహుమతి సాధించింది. ఈ నేపథ్యంలో ఈ ఛైర్మన్ పదవిని మళ్లీ పచౌరీనే స్వీకరించనున్నారు. ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
|