సింగపూర్లో వచ్చే నెల జరుగనున్న ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల్లో ఆ దేశానికి చెందిన నలుగురు అగ్ర నేతలు పాల్గొననున్నారు. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు అక్టోబర్ 10న ప్రారంభం కానున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అనంతరం మంత్రి లీ కువాన్ యూతో చర్చా సదస్సు జరుగనుంది.
ఈ సందర్భంగా ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి, సింగపూర్లోని భారత్ రాయబారి ఓంగ్ కెంగ్ యాంగ్ మాట్లాడుతూ, ఈ ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాలను ముందస్తుగా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రవాసీ భారతీయ దివస్ కాన్ఫరెన్స్ను భారత్ 2003 సంవత్సరం నుంచి దేశంలోని ముఖ్య నగరాల్లో నిర్వహిస్తోందని అన్నారు.
|