ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా ఆసియా యువ బిలియనీర్ల జాబితాలో ఆరుగురు ఎన్నారైలు స్థానం సంపాదించుకున్నారు. వీరిలో ర్యాన్బ్యాక్సీ మల్విందర్, షివిందర్ సింగ్, రియల్ ఎస్టేట్ ఫర్మ్ ఒబేరాయ్ కన్స్ట్రక్షన్స్ వికాస్ ఒబేరాయ్, ఆన్లైన్ గాంబ్లింగ్ ఎంటిటీ పార్టీ గేమింగ్స్ వ్యవస్థాపకుడు అనురాగ్ దీక్షిత్లు ఉన్నారు.
ఇంకా, సజ్లాన్ ఎనర్జీ గిరీష్ తంతి, ఇండియా బుల్స్ సమీప్ గెహ్లాట్లు కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే భారత్లో మిలియనీర్లు 23 శాతానికి పెరిగారని ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. అలాగే గత ఏడాది 36 శాతంగా ఉన్న బిలియనీర్లు ఈ ఏడాది 53 శాతానికి పెరిగారని ఆ పత్రిక తెలిపింది.
|