ప్రధాన పేజి > ఇతరాలు > ఎన్.ఆర్.ఐ. > ప్రత్యేక వార్తలు > దాడులపై కేంద్రానికి సుప్రీం అక్షింతలు..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దాడులపై కేంద్రానికి సుప్రీం అక్షింతలు..!
FILE
ఆస్ట్రేలియాలో భారతీయులపై రోజురోజుకీ పెరిగిపోతున్న జాత్యహంకార దాడులపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి అక్షింతలు వేసిన సుప్రీం ధర్మాసనం... విద్యార్థులపై దాడుల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, దాడులు ఏ మాత్రం ఆగటం లేదని, అలాంటప్పుడు ఎన్ని చర్యలు తీసుకుని ఏం ప్రయోజనమని ప్రశ్నించింది.

రక్షణ కోసం చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టిన ధర్మాసనం... ముఖ్యమైన ఈ సమస్యను చుట్టచుట్టి ఒక మూలన పడవేయలేమని వ్యాఖ్యానించింది. కాగా, ఈ నెల మొదటివారంలో దాడుల అంశమై అఫిడవిట్ దాఖలుకు కోర్టు ఆదేశించగా ప్రభుత్వం సమర్పించింది.

ఈ సందర్భంగా... దాడులను ఆపేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవటం లేదని అటార్నీ జనరల్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇదే అంశంపై సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ప్రవాస విద్యార్థుల కోసం "డేటా బ్యాంక్‌" ఏర్పాటు
ఆస్ట్రేలియా బాధితుడి కుటుంబానికి ప్రభుత్వ సాయం
ఆగని దాడులు : మరో ఇద్దరిపై దుండగుల ప్రతాపం
"సీటీఏ" మహాసభల ఏర్పాట్లు మమ్మురం..!
"బిగ్ బ్రదర్" నుంచి తప్పుకోనున్న శ్రీ దాసరి
ఆస్ట్రేలియన్లకు "ఫిసా" కృతజ్ఞతలు