ప్రధాన పేజి   ఇతరాలు > ప్రేమాయణం > మధుర జ్ఞాపకాలు
 
సావిత్రి-సత్యవంతుల ప్రేమ కథ
హిందూ పురాణేతిహాసాలలో సావిత్రి-సత్యవంతుల ప్రేమ వృతాంత్తానికి ప్రత్యేక స్థానం ఉన్నది. తరాలు మారినా, మానవజీవన శైలిలో విన్నూత్నపోకడలు చోటు చేసుకున్నప్పటికీ వారిరువురి మధ్య అనురాగం ఆచంద్రతారార్కం నిలిచి ఉంటుంది.

గొప్పవాడైన ఒక మహారాజు అందాల కుమార్తె సావిత్రి. ఆమె సౌందర్యం నలుదిశలా వ్యాపించడంతో ఇతర రాజ్యాల రాజులు తమకు సావిత్రితో వివాహం జరిపించవలసిందిగా కోరుతూ సావిత్రి తండ్రికి వర్తమానాలు పంపించడం ప్రారంభించారు. అయితే రాజుల పరిణయ ప్రతిపాదనలను సావిత్రి నిరాకరించింది. తనకు సరియైన వరుని ప్రపంచమంతా తిరిగి తానే ఎంచుకుంటానని సావిత్రి తండ్రికి తెలిపింది. తండ్రి నియమించిన అంగరక్షకులు తోడుగా వరుని వెదికేందుకు సావిత్రి దేశాటన ప్రారంభించింది.

ఒకరోజు దట్టమైన అడవిలోకి ప్రవేశించిన సావిత్రి రాజ్యం కోల్పోయి అరణ్యవాసం చేస్తున్న అంధులైన రాజదంపతులను చూసింది. ఒక చిన్న పూరిపాకలో నివసిస్తున్న రాజదంపతులకు సేవలు చేస్తున్న వారి కుమారుడైన సత్యవంతుని గమనించింది. తల్లిదండ్రులను పోషించే నిమిత్తం అడవిలో కట్టెలను కొట్టి సమీపంలోని గ్రామంలో సత్యవంతుడు విక్రయిస్తాడు. సత్యవంతుని సావిత్రి తొలిచూపులోనే ప్రేమిస్తుంది.

తన అన్వేషణకు ముగింపు పలుకుతుంది. సిరిసంపదలు లేకుండా అరణ్యంలో జీవిస్తున్నసత్యవంతునికి సావిత్రిని ఇచ్చి వివాహం చేసేందుకు ఆమె తండ్రి నిరాకరిస్తాడు. అంతేకాక వివాహమైన సంవత్సరకాలానికే సత్యవంతుడు మరణిస్తాడని పండితులు చెప్పడంతో సావిత్రి తండ్రి ఆందోళన చెందుతాడు. అయినా సావిత్రి వినకపోవడంతో వారిరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తాడు.
  1 | 2  >> 
మరిన్ని
శకుంతలాదుష్యంతుల ప్రేమకథ
నల-దమయంతుల ప్రేమకథ
ది మోస్ట్ లవ్లీ క్వీన్ లవ్‌స్టోరీ
"ఆమె"ని పెళ్ళి చేసుకున్న"ఆయనగారు" : శ్రీకాంత్‌
ఫెనికి కవి కీట్స్ వ్రాసిన లేఖ
ఆల్బర్‌‌టకు విక్టోరియా లేఖ