పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో మళ్లీ బ్రహ్మోత్సవాల సందడి నెలకొననుంది. ఈనెల 12వ తేదీ నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. దసరా సెలవులు కూడా రావడంతో ఈ బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని టీటీడి అంచనా వేస్తోంది. అన్ని ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను టీటీడి రద్దు చేసింది. ఈసారి బ్రహ్మోత్సవాలలో బంగారు తేరుపై మాత్రమే శ్రీవారు ఊరేగుతారు. 20వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు భారీ భద్ర తా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమల మొత్తాన్ని హైసెక్యూరిటీ జోన్గా ప్రకటించారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తితిదే ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. తిరుమలలో పలుచోట్ల ఉచిత వైద్య... |