గిరిజనులు అధికంగా నివసించే మధ్యప్రదేశ్లోని బార్వని, థార్, ఖర్గోనే మరియు ఝబువా జిల్లాలలో దీపావళి పండుగను విన్నూత్నంగా జరుపుకుంటారు. దీపావళికి నెలరోజుల ముందు గ్రామంలో ఎవరైనా చనిపోతే దీపావళి పండుగను జరుపుకోవడం మానేస్తారు. ఇక బరేలా తెగకు చెందిన గిరిజనులు దీపావళి పండుగను మూడు రోజులపాటు జరుపుకుంటారు.
మొదటిరోజు ఆవు పేడతో ఇంటిని అలుకుతారు. తర్వాత ఆవుపేడతో చేసిన ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. పండుగకు ముందుగానే ఇతర గ్రామాలలో నివసించే బంధువులకు ఆహ్వానం పంపుతారు. పండుగకు ముందు రోజు దైవప్రార్థనకు ఉద్దేశించిన సామాగ్రితోపాటు ఒక గుడ్డు, సజ్జ విత్తనాలు, మరియు టేకు గోళ్ళతో కూడిన బుట్టను ప్రతి కుటుంబానికి చెందిన సభ్యుడు..... |