శిక్షణ అనంతరం రష్యా దేశపు సౌజన్యంతో రష్యా అంతరీక్ష పరిశోధన సంస్థతో కలిసి పని చేసిన సునీత, అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో పనిచేసేందుకు ఎంపికైన వ్యోమగామిలో ఒకరిగా నిలిచారు. ఇటీవల నాసా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి పంపిన ఐఎస్ఎస్లో ఫ్లైట్ ఇంజినీర్గా సునీతా విలియమ్స్ సేవలందించారు. ఎక్స్పెడిషన్-14 సిబ్బందిలో నాలుగు స్పేస్వాక్లలో మొత్తం 29 గంటల 17 నిమిషాలపాటు నిర్వహించిన మహిళా వ్యోమగామిగా సునీతా విలియమ్స్ ప్రపంచ రికార్డును నెలకొల్పారు.
అలాగే అంతరిక్షంలో 195 రోజులు గడపడం ద్వారా షెన్నన్ ల్యూసిడ్ రికార్డును తిరగరాశారు. అంతర్జాతీయ అంతరీక్ష కేంద్రం తన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సునీతా విలియమ్స్, 2007 సంవత్సరం జూన్ 22న భూమికి సురక్షితంగా చేరుకున్నారు. భవిష్యత్లో అంగారక గ్రహంపై పాదంమోపాలన్నదే తన తదుపరి లక్ష్యమని సునీతా విలిమయ్స్ వినమ్రయంగా చెపుతోంది.
ప్రపంచ మహిళా జాతికే మణిమకుటంగా నిలిచిన సునీతా విలియమ్స్.. మాతృభూమిపై మమకారం మాత్రం తగ్గలేదు. అందుకే.. నింగి నుంచి భూమికి వచ్చాక తన పూర్వీకులు నివశిస్తున్న గుజరాత్ రాష్ట్రానికి వచ్చి వారి ప్రేమానురాగాలను పొందింది.
|