ఈ ఏడాది సినీ రంగంపై మీడియా అమితాసక్తి కనపరిచింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై జాతీయ స్థాయిలో మీడియా తన దృష్టిని కేంద్రీకరించింది. దీనికి ఆజ్యం వేసవిలో జరిగిన తెలుగు చలన చిత్ర వజ్రోత్సవ వేడుకలు మీడియాకు పద్ద ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవాలు నిర్వహించిన కేఎస్.రామారావును ఉద్దేశించి మోహన్బాబు చేసిన ఉద్ధేశపూర్వక ప్రసంగం మెగాస్టార్ ఇచ్చిన ఆవేశపూరిత సమాధాననాలపై జాతీయ స్థాయిలో పెద్ద చర్చే జరిగింది. దాంతో సినిమా రంగంలో రెండు గ్రూపులు ఉన్నాయనే విషయం సగటు ప్రేక్షకుడికి తేటతెల్లమైంది.
మరోవైపు పవన్ కళ్యాణ్ వివాహం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆయన మొదటి భార్య వైజాగ్కు చెందిన నందిని.. తనకు విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకున్నాడనీ, తనకు మనోవర్తి లభించడం లేదని కోర్టుకెక్కింది. అయితే... డేటింగ్ తరహాలో విదేశీ పద్దతిని మాత్రమే అవలంభించాననీ, తనకు రేణూ దేశాయ్కు వివాహం జరగలేదని ఉత్తిగానే కలసి ఉంటున్నామంటూ.. కాకమ్మ కథలతో మీడియాకు పబ్లిక్కు మంచి మేత వేశాడు. దీంతో ఏనోటా విన్నా వీరివివాహం గురించే.
ఇదిలావుంటే.. చిరంజీవి తన చిన్న కుమార్తె శ్రీజ-శిరీష్ భరద్వాజ్ల ప్రేమ వివాహం కూడా మీడియాను ఆకర్షించింది. సస్పెన్స్ సినిమాల్లాగా ఆమె వివాహం హైదరాబాద్లో మొదలై ఢిల్లీలో ముగిసింది. మధ్యలో ఎన్నో ట్విస్ట్లు, ఛేజ్లు మీడియాకు మళ్లీ మంచి మేత దొరికినట్టియింది. తనకు తన బాబాయ్ నుంచి ప్రాణరక్షణ కల్పించాలంటూ.. శ్రీజ పేర్కొనడంతో సినిమాటిక్గా పవన్ కళ్యాణ్ తన లైసెన్స్ రివాల్వర్ను పోలీసు స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం మరో విశేషం.
|