ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > 2007 రౌండప్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
భారతీయ అవలోకనం-2007
FileFILE
యూపీఏకు గుదిబండగా మారిన అణు ఒప్పందం...
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటైన భారత్‌ భవిష్యత్‌ను దష్టిలో ఉంచుకుని... ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి, భవిష్యత్ విద్యుత్‌ అవసరాల కోసం అమెరికాతో చేతులు కలపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని నాటి వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

దీన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమలుకు తెచ్చేందుకు ప్రయత్నించింది. చివరకు ఆ అణు ఒప్పందమే యూపీఏ ప్రభుత్వానికి గుదిబండగా మారింది. అణు ఒప్పందంలోని హైడ్ బిల్లులోని కొన్ని అంశాలపై యూపీఏ కీలక భాగస్వామి అయిన వామపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో.. ఒప్పందం అమలు ప్రశ్నార్థకంగా మారింది.

కోర్టు తీర్పులు...
1993లో జరిగిన ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసు తుదితీర్పు వెలువడింది. ఈ కేసులో అక్రమంగా తుపాకీ కలిగి ఉన్నందుకు ఆయుధ చట్టం కింద ముంబై ప్రత్యేక కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది. కొద్ది రోజుల పాటు.. జైలు శిక్ష అనుభవించిన అనంతరం సుప్రీం కోర్టు అనుమతితో విడుదలయ్యారు. అలాగే.. కష్ణ జింకల వేట కేసులో మరో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రపంచ క్రికెట్‌ బెట్టింగ్ ఆరోపణలు రావడంతో వినోద్, అనూప్ కుమార్, అమిత్ కుమార్ తదితరులను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.

నేరాలు... ఘోరాలు...
ఫిబ్రవరి నెల 18వ తేదీన హర్యానా రాష్ట్రంలో పానిపట్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. పాక్-భారత్‌ల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబులు పేలగా.. 68 మంది దుర్మరణం పాలయ్యారు. మరో వందమందికి పైగా గాయాల పాలయ్యారు. హైదరాబాద్‌లోని చారిత్రక మక్కా మసీదులో మే నెల 18వ తేదీన జరిగిన బాంబు పేలుళ్లలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. యాభై మందికి పైగా గాయపడ్డారు. భారతదేశ చరిత్రలో ఒక మసీదులో బాంబు పేలడం ఇదే తొలిసారి.

జులై ఏడో తేదీన ముంబై మహానగరంలోని సబర్బన్ రైళ్లలో ఏడు చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 209 మంది మృత్యువాత పడ్డారు. మరో 700 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లకు లష్కర్ తోయిబా తీవ్రవాదులు కారణమని పోలీసులు దర్యాప్తులో నిర్థారించారు. అలాగే.. ఆగస్టు 30వ తేదీన హైదరాబాద్‌లోని లుంబిని పార్కు, గోకుల్ చాట్‌లలో ఒకే సమయంలో పేలిన వరుస బాంబు పేలుళ్లలో 35 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
 << 1 | 2 | 3  >> 
మరిన్ని
జయాపజయాల కలబోత-2007
భారత క్రికెట్ లెజండ్.. మాస్టర్ బ్లాస్టర్
క్రికెట్ ప్రపంచ ఆణిముత్యం.. మురళీధరన్
భాగ్యనగరి చరిత్రకు మాయని మచ్చ వరుస పేలుళ్లు
ఓనమాలకు ఊతమిచ్చిన 2007
ఈ సంవత్సరపు మృత్యుంజయులు