ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > 2007 రౌండప్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ధరిత్రి ప్రేమికునికి అత్యున్నత పురస్కారం
FileFILE
"వసుధైక కుటుంబం అన్న భావనతోనే యావత్ ప్రపంచం సుఖ శాంతులతో మనగలుగుతుందనే సూత్రాన్ని అంతర్జాతీయ సమాజానికి చాటి చెప్పిన భారత దేశం కన్న బిడ్డను నేను. ప్రాచీన కాలంలోనే ప్రపంచానికి నాగరికతను నేర్పిన భారతదేశపు వసుధైక కుటుంబ తత్వం పర్యావరణ పరిరక్షణతోనే మనగలుగుతుందని త్రికణ శుద్ధిగా విశ్వసిస్తున్న వారిలో నేను ఒకడినే అని నాకు అత్యున్నతమైన నోబెల్ శాంతి పురస్కారంలో భాగస్వామ్యాన్ని కల్పించిన ఈ గొప్పదైన సభకు వినమ్రంగా విన్నవించుకుంటున్నాను"...

2007 డిసెంబర్ 10వతేదీన నార్వే దేశంలోని ఓస్లోలో అమెరికా దేశపు మాజీ ఉపాధ్యక్షుడు అల్ గొరేతో కలిసి నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా డాక్టర్ రాజేంద్ర కే పచౌరీ ప్రసంగంలో చోటు చేసుకున్న పంక్తులివి. పరిశుభ్రమైన నీటి లభ్యత, అవసరమైన మేరకు ఆహారం, నిలకడగా ఉండే ఆరోగ్య పరిస్థితులు, ప్రకృతి సిద్ధమైన వనరులు, నివాస భద్రత ఉన్నప్పుడే పర్యావరణ సమతుల్యత పరిరక్షించబడుతుందని పచౌరీ పేర్కొన్నారు.

నీటి సరఫరా వ్యవస్థ కల్పన, ప్రజారోగ్య సేవలు పెట్టుబడుల పెంపుదల, నీటివనరుల నిర్వహణ, సముద్ర తీర ప్రాంతంలో సురక్షిత ఏర్పాట్లు, పకృతి వైపరీత్యాల తీవ్రతను తగ్గించే పథకాలు. అంతర్జాతీయ సమాజం సమన్వయంతో వ్యవహరించి సరియైన చర్యలను చేపట్టడం ద్వారా ప్రపంచంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో తలెత్తె దుష్పరిణామాలను గురికావడంలో ముందుండే ప్రాంతాల వారిని, ఆయా ప్రాంతాల వ్యవస్థను కాపాడే దిశగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రతి యేటా పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపట్టడంలో మనం చేసే ఆలస్యం భవిష్యత్తులో పర్యావరణంలో ప్రమాదకరమైన రీతిలో పెనుమార్పులు సంభవించేందుకు కారణమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో పేదరికంలో మగ్గిపోతున్న ప్రాంతాలు పర్యావరణ దుష్ప్రరిణామాల తాలూకు ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందనే దానికి తార్కాణంగా నిలుస్తున్నాయనేది దాచినా దాగని నిష్టూర సత్యమని పచౌరీ హెచ్చరించారు.
  1 | 2  >> 
మరిన్ని
మన పొరుగుదేశాలు రాజకీయాలు
భారతీయ చదరంగానికి మైలురాయి 2007
భారతీయ అవలోకనం-2007
జయాపజయాలతో టాలీవుడ్
భారత క్రికెట్ లెజండ్.. మాస్టర్ బ్లాస్టర్
క్రికెట్ ప్రపంచ ఆణిముత్యం.. మురళీధరన్