భారతదేశంలోని నైనిటాల్లో 1940 ఆగస్టు పదవతేదీన పచౌరీ జన్మించారు. వారణాసిలోని డీజిల్ లోకోమోటీవ్స్లో పలు కార్యనిర్వహణ బాధ్యతలను నిర్వహించిన పచౌరీ అనంతరం అమెరికాలోని నార్త్ కరొలీనా స్టేట్ యూనివర్శిటీలో చేరి 1972 సంవత్సరంలో ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్లో ఎమ్మెఎస్ పట్టాను పుచ్చుకున్నారు.
అలాగే అదే యూనివర్శిటీలో ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్లో డాక్టరేట్ మరియు ఎకనమిక్స్లో పీహెచ్డీ చేశారు. తదనంతర కాలంలో స్వదేశానికి విచ్చేసిన పచౌరీ ప్రభుత్వ అనుబంధిత సంస్థలలో కీలకమైన పదవులలో తనదైన శైలిలో ప్రతిభాపాటవాలను ప్రదర్శించి, ఆయా సంస్థల గతిని అభివృద్ధి దిశగా మళ్ళించారు.
ఆయన ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 2001 జనవరిలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. 1988 సంవత్సరంలో వరల్డ్ మెటరోలాజికల్ ఆర్గనైజేషన్ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సంయుక్తంగా స్థాపించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ఛైర్మన్గా బాధ్యతలను నిర్వహిస్తున్న డాక్టర్ రాజేంద్ర కే పచౌరీ నోబెల్ శాంతి పురస్కారాన్ని పంచుకోవడం పర్యావరణ ప్రేమికులకు 2007 సంవత్సరం అందించిన మధురమైన జ్ఞాపకం.
|