ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 07 > 2007 రౌండప్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
పాక్ ప్రజాస్వామ్యానికి విఘాతం - భుట్టో మరణం
సైనిక మద్దతును కూడగట్టుకున్న పాక్ రాష్ట్రపతి గులాం ఇషాక్ ఖాన్ వివాదాస్పదమైన ఎనిమిదవ రాజ్యాంగ సవరణతో కేవలం 20 మాసాల వ్యవధిలోనే పార్లమెంటును రద్దు చేసి, పాక్ ప్రజలపై ఎన్నికలను రుద్దారు. 1993 సంవత్సరంలో రెండవ సారి ప్రధానిగా ఆమె తిరిగి ఎన్నిక అయ్యారు. అయితే పలు అవినీతి కుంభకోణాలు కారణంగా చూపి, ఎనిమిదవ అధికరణం ద్వారా సంక్రమించిన అధికారాలతో రాష్ట్రపతి ఫారూఖ్ లెఘారీ, కేవలం మూడు సంవత్సరాల కాలవ్యవధిలోనే బెనజీర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అనంతర కాలంలో చోటు చేసుకున్న సైనిక తిరుగుబాటులో ఆమె మరోసారి దేశబహిష్కరణకు గురయ్యారు.

ఆ విధంగా 1988 నుంచి 1990 వరకు మరియు 1993 నుంచి 1996 మధ్యకాలంలో ఆమె రెండు సార్లు ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టారు. దేశబహిష్కరణకు గురైన బెనజీర్ భుట్టో, పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌తో కుదుర్చుకున్న లోపాయకారీ ఒప్పందంతో 2007 సంవత్సరం అక్టోబర్ 19న స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆమె రాక సందర్భంగా జరిగిన ర్యాలీపై మానవబాంబుల దాడితో 150 మంది మరణించారు. ఈ సందర్భంగా పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ఎమర్జెన్సీని విధించి అనంతరం అంతర్జాతీయ సమాజం తెచ్చిన ఒత్తిళ్లతో రెండు నెలల వ్యవధిలోనే ఎమర్జెన్సీని తొలగించారు. 2008 జనవరి ఎనిమిదిన సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాక్ ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఎన్నికల రణరంగంలో విజయం సాధించేందుకు యుద్ధప్రాతిపదికన బెనజీర్ భుట్టో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తన ప్రచారంలో భాగంగా 2007 డిసెంబర్ 27వ తేదీ సాయంత్రం రావల్పిండిలో ఎన్నికల సభలో ఆమె పాల్గొన్న సమయంలో ఆత్మహుతి దళ దాడి జరిగింది. ఈ సందర్భంగా తీవ్రంగా గాయపడిన బెనజీర్ భుట్టోను రావల్పిండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భారతీయ కాలమాన ప్రకారం సాయంత్రం 06:46 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు.
 << 1 | 2   
మరిన్ని
మీడియాకు సరికొత్త సవాళ్ళు
రాష్ట్ర రాజకీయాలలో 'మధ్యంతర' ప్రకంపనలు
ధరిత్రి ప్రేమికునికి అత్యున్నత పురస్కారం
మన పొరుగుదేశాలు రాజకీయాలు
భారతీయ చదరంగానికి మైలురాయి 2007
భారతీయ అవలోకనం-2007