ప్రధాన పేజి > వెబ్‌దునియా స్పెషల్ 08 >  చంద్రయాన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చర్చి నుంచి మొదలై చంద్రయానం వరకూ...
FILE
దాదాపు 45 సంవత్సరాల క్రితం శూన్యం నుంచి మొదలై... ప్రస్తుతం చంద్రలోక యాత్ర వరకు పరచుకున్న భారత అంతరిక్ష ప్రయోగాల చరిత్రకు దేశంలోని ఒక మారు మూల పల్లెలోని చర్చిలో బీజం పడిందంటే ఆశ్చర్యం వేస్తుంది మరి. పరిశోధనా స్టేషన్లకు, లేబోరేటరీలకు కడు దూరంగా కేరళలోని ఒక మారుమూల మత్స్యకారులు గ్రామమైన తుంబాలో ఉన్న పాత చర్చిలో భారతీయ అంతరిక్ష కార్యక్రమం ప్రారంభమైందంటే ఒళ్లు గగుర్పాటు వేస్తుంది.

చైనా చేతిలో 1962లో భారత సైనికబలగాలు పొందిన పరాభవ జ్వాలలు భారత జాతీయ నాయకత్వంలో సాంకేతిక జ్ఞానంపై కాంక్షలను పురికొల్పాయి. నాటి ప్రధాని జవహర్‌లాల్ మదిలోంచి పుట్టుకొచ్చిన భావన అంతరిక్ష పరిశోధనకు భారతీయ జాతీయ కమిటీకి మొగ్గ తొడిగింది. ఇది 1962 నాటి మాట.
స్వప్న సాకార క్షణం...
  ఆ క్షణమే... భారతీయ అంతరిక్ష పరిశోధనలకు బీజం తొడిగింది. ఆ క్షణమే.. భారతీయ శాస్త్రజ్ఞుల స్వప్నాలకు సాకారమై నిలిచింది. ఆ ఘనతర క్షణమే... బిషప్ మాటలకు కిమ్మనకుండా సమ్మతించిన తుంబా గ్రామీణుల నిండు హృదయాల సాక్షిగా భారతీయ అంతరిక్ష ప్రస్థానం మొదలైంది.      


ఈ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా భారత అణు పితామహుడు హోమీ బాబా, విక్రమ్ సారాభాయ్ కలిసి దేశంలో రాకెట్ స్టేషన్ ఏర్పాటు కోసం ముందుగా కేరళలో పలు ప్రాంతాలలో అన్వేషించారు. చిట్టచివరకు వారి కన్ను తుంబాపై పడింది.

అనువైన స్థలం దొరికింది కానీ అక్కడా ఓ చిన్న అడ్డంకి. ఆ గ్రామంలో నివసిస్తున్న మత్స్యకారులు తాము పుట్టి పెరిగిన మట్టిపై భావోద్వేగాలను పెనవేసుకుని మరీ పెరిగారు. అందులోనూ గ్రామంలోని సెయింట్ మేరీ మాగ్డలీన్ చర్చి అంటే వారికి ప్రాణంతో సమానం. రాకెట్ కేంద్రం స్థాపనకు ఈ గ్రామాన్ని ఎంచుకోవడం అంటే కష్టమైన పనే మరి.

అందుకే ఆ కష్టమైన పనికి తిరువనంతపురం మాజీ బిషప్ ఒకరిపై భారం పెట్టారు. ఒక ఆదివారం చర్చి సమావేశంలో ఆ బిషప్ గ్రామస్తులను సమావేశపర్చి అంతరిక్ష కార్యక్రమం ప్రయోజనాలను విడమర్చి చెప్పారు. తర్వాత, తుంబా గ్రామాన్ని భారత అంతరిక్ష శాఖకు స్వాధీనపరిస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవుగా అని అడిగారు.

ఒక్క క్షణం గ్రామస్తుల హృదయాల్లో లక్ష భావాలు, సందేహాలు. అంతరిక్ష కార్యక్రమం గురించి బిషప్ చెప్పిన మాటలు మనసులలో కదులాడింది. ఒకే ఒక్క క్షణం జాప్యం. ఒక్కసారిగా ఊపిరి తీసుకుని గ్రామస్తులంతా 'ఆమెన్' అన్నారు.

అంతే... ఆ క్షణమే... భారతీయ అంతరిక్ష పరిశోధనలకు బీజం తొడిగింది. ఆ క్షణమే.. భారతీయ శాస్త్రజ్ఞుల స్వప్నాలకు సాకారమై నిలిచింది. ఆ ఘనతర క్షణమే... బిషప్ మాటలకు కిమ్మనకుండా తలవంచి సమ్మతించిన తుంబా గ్రామీణుల నిండు హృదయాల సాక్షిగా భారతీయ అంతరిక్ష ప్రస్థానం మొదలైంది.

భారతీయ అంతరిక్ష కార్యక్రమానికి అదొక మంగళపదమైన ప్రారంభంగా రోదసీ నిపుణులు తర్వాత వ్యాఖ్యానించారు. తుంబా గ్రామం నుంచి తమ నివాస ప్రాంతాలను వేరే చోటికి మార్చుకున్న గ్రామీణుల ఆశీర్వాదం సాక్షిగా భారత అంతరిక్ష ప్రాజెక్టు మొగ్గ తొడిగింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
1 | 2  >>  
మరిన్ని
శ్రీరంగపట్నం నుంచి శ్రీహరికోట దాకా....
చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-1పై బ్రిటీష్ శాస్త్రవేత్త ఎదురుచూపు
చంద్రయాన్-1: కౌంట్‌డౌన్ ప్రారంభం