ప్రధాన పేజి > వెబ్‌దునియా స్పెషల్ 08 >  చంద్రయాన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చర్చి నుంచి మొదలై చంద్రయానం వరకూ...
FILE
ఒకప్పుడు అతి చిన్న ప్రార్థనా స్థలంగా ఉన్న ప్రాంతం తర్వాత ఎపిజె అబ్దుల్ కలాంతో సహా పలువురు భారతీయ రాకెట్ శాస్త్రజ్ఞుల ప్రధాన నిలయంగా రూపుదిద్దుకుంది. ప్రస్తుతం అంతరిక్ష మ్యూజియంగా ఉన్న ఈ చర్చిలోనే తొలినాటి భారతీయ రాకెట్లకు సంబంధించిన నమూనాలు ప్రాణం పోసుకున్నాయి.
స్వప్న సాకార క్షణం...
  చంద్రయానంపై భారతీయ స్వప్నం ఏమంత తేలిగ్గా సాగలేదు. ఏది ఏమైనా తుంబా గ్రామీణులు, శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమానికి పురుడు పోసిన ఆ చిన్ని చర్చిని కలకాలం గుర్తు పెట్టుకుంటారు. జాతి మొత్తం కూడా వారితో పాటే మరి..      


అయితే తొలినాళ్లలో పరిస్థితులు దుర్భరంగానే ఉండేవని చెప్పాలి. రోదసీ శాస్త్రజ్ఞులు ప్రతిరోజూ తిరువనంతపురం నుంచి రద్దీగా ఉన్న బస్సుల్లో తుంబా కేంద్రానికి ప్రయాణించవలసి వచ్చేది. రైల్వే స్టేషన్‌లో ఆహారం కొనుక్కుని మరీ ఆ మారుమూల ప్రాంతానికి చేరుకునేవారు.

అతి త్వరలోనే తుంబా గ్రామం తుంబా ఈక్విటేరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్‌గా మారింది. మొట్టమొదటి సౌండింగ్ రాకెట్‌ను 1963 నవంబర్‌లో ప్రయోగించారు. నైక్ అపాచే అనే పేరుగల ఈ రాకెట్‌ను నాసా అందించింది. అప్పటినుంచి వాతావరణాన్ని అధ్యయనం చేసే పలు సౌండింగ్ రాకెట్లు తుంబా నుంచి ప్రయోగించబడ్డాయి.

చివరకు అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలకు చెందిన రాకెట్లు కూడా ఇక్కడినుంచి ప్రయోగించారు. మొదట్లో అనేక రాకెట్ విడిభాగాలను శాస్త్రజ్ఞులు సైకిళ్లపై పెట్టుకుని తుంబాలో ఒకచోటినుంచి మరో చోటికి తీసుకెళ్లేవారు. ఇప్పుడైతే ప్రతి వారం సౌండింగ్ రాకెట్లు తుంబానుంచి ప్రయోగించబడుతుంటాయి. ఎట్టకేలకు తుంబా రాకెట్ కేంద్రం అధునాతన స్టేషన్‌గా మారిపోయింది.

తొలినాళ్లలో సౌండింగ్ రాకెట్ కార్యక్రమ విజయంతో ప్రభావితుడైన సారాభాయి, భారత్ తన స్వంత ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని తన టీమ్‌తో చెప్పారు. స్వంతంగా దేశం ఉపగ్రహాలను ప్రయోగించాలంటే మరో ప్రయోగ కేంద్రం కావాలి. గగనతల అన్వేషణలో భాగంగా విక్రమ్ సారాభాయ్ ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీహరికోట పరిసరాలను చూసి అబ్బుర పడ్డారు.

చుట్టూ సముద్రం దట్టమైన అడవి.. దానికి తోడు యానాదుల నివాస స్థలంగా ఉన్న శ్రీహరికోట ఆ క్షణం నుంచే తన నడకను మార్చుకుంది. యానాదులు స్థానిక ప్రజల మద్దతుతో శ్రీహరికోటలో భారతీయ ఉపగ్రహ కేంద్రానికి పునాది రాయి పడింది. తరువాత నడిచిందల్లా చరిత్ర క్రమమే..

చంద్రయానంపై భారతీయ స్వప్నం ఏమంత తేలిగ్గా సాగలేదు. ఏది ఏమైనా తుంబా గ్రామీణులు, శాస్త్రవేత్తలు భారత అంతరిక్ష కార్యక్రమానికి పురుడు పోసిన ఆ చిన్ని చర్చిని కలకాలం గుర్తు పెట్టుకుంటారు. జాతి మొత్తం కూడా వారితో పాటే మరి..
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
<< 1 | 2 
మరిన్ని
శ్రీరంగపట్నం నుంచి శ్రీహరికోట దాకా....
చంద్రయాన్-1 ప్రయోగం విజయవంతం
చంద్రయాన్-1పై బ్రిటీష్ శాస్త్రవేత్త ఎదురుచూపు
చంద్రయాన్-1: కౌంట్‌డౌన్ ప్రారంభం