ప్రధాన పేజి > వెబ్‌దునియా స్పెషల్ 08 >  చంద్రయాన్
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వెన్నెల రాజు త్రివర్ణ పతాక ధారణం
WD
ఆహ్లాదాన్ని పంచే చందమామపై మరికొద్ది గంటల్లో భారతీయ త్రివర్ణ పతాకం చేరనుంది. చంద్రుని తుది కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-1 లోని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ శుక్రవారం రాత్రి సరిగ్గా 8 గంటల 4 నిమిషాలకు ఉపగ్రహం నుంచి విడివడి రాత్రి ఎనిమిదిన్నర ప్రాంతంలో చంద్రుని ఢీకొడుతుంది. ఈ పరికరంపై భారతీయ మువ్వెన్నల జెండాను చిత్రీకరించారు. పరికరం చంద్రుని ఢీకొట్టడం ద్వారా మన దేశం చంద్రునిపై అడుగుపెట్టినట్లవుతుందని షార్ ప్రతినిధి సతీష్ పేర్కొన్నారు.

చంద్ర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించిన చంద్రయాన్-1 మరో రెండేళ్లపాటు ఈ కక్ష్యలోనే ఉంటుంది. కాగా 2012 నాటికి చంద్రయాన్-2 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. దీని సహాయంతో చంద్ర మండలంలోని నమూనాలను సేకరించి వాటిని అధ్యయనం చేస్తామని తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జాబిల్లి తుది కక్ష్యలో ప్రవేశించిన చంద్రయాన్
చంద్రుని తర్వాత 'ఆదిత్యు'నిపై ఇస్రో దృష్టి
చంద్రుని కక్షలోకి చంద్రయాన్-1 : ప్రయోగం సక్సెస్
చంద్రునిపై చంద్రయాన్ నీటిని కనుగొంటుందా..?
జాబిలికి మరింత దగ్గరగా 'చంద్రయాన్-1'
2015 లోపే అంతరిక్షంలోకి భారతీయులు...!