ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > స్వాతంత్ర్య దినోత్సవం > దేశభక్తి మూర్తీభవించిన మార్క్సిస్టు 'మణిదీపం'
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దేశభక్తి మూర్తీభవించిన మార్క్సిస్టు 'మణిదీపం'
FileFILE
అది 1932 సంవత్సరం. తెల్లదొరల ప్రభుత్వ పరిపాలన. మరోవైపు స్వాతంత్ర్య పోరాటం జోరుగా సాగుతున్న రోజులు. పంజాబ్‌ రాష్ట్రంలోని హోషియార్ జిల్లాలో ఎటు చూసినా స్వాతంత్ర్య పోరాట ఆందోళనలే. అపుడే.. నూగునూగు మీసాలు కలిగిన యువకుడు. బ్రిటీష్ పాలకుల ఆదేశాలను ధిక్కరించాడు. ప్రభుత్వ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు. అంతేకాదు.. కోర్టుకు హాజరై.. తానే మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన భరతమాత ముద్దుబిడ్డను అంటూ.. రొమ్మువిరిచి చెప్పిన యువతేజం. ఆ యువకుడే హరికిషన్ సింగ్ సుర్జీత్.

శరీరంలోని ప్రతి అణువూ దేశభక్తి నిండిన ఈయన.. 93 సవంత్సరాల వృద్ధాప్యంలో కన్నుమూశారు. 1916 మార్చి 23న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లా రూపోవాల్‌లో జన్మించిన సుర్జీత్.. కన్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా స్వార్థ రాజకీయ శక్తుల నుంచి భరతజాతిని రక్షించేందుకు తుదికంటా కృషి చేసిన పోరాట యోధుడు హరికిషన్. కేవలం మెట్రిక్యులేషన్ వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసిన ఆయన.. మార్క్సిస్టు పార్టీలో మహోపాధ్యాయుని పాత్ర పోషించారు.

ముఖ్యంగా.. భిన్నధృక్పథాలు కలిగిన అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన ఘనత సుర్జీత్‌కే చెల్లుతుంది. మతోన్మాదం కంటే ప్రమాదమైనది మరొకటి లేదనే నిర్మొహమాటంగా ప్రకటించి, లౌకిక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి, దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు నాంది పలికారు. స్వచ్ఛమైన మార్క్సిస్టు వాదిగా ఉంటూ బూర్జువా పార్టీలతో తిరగడమేమిటనే విమర్శలను సైతం ఆయన ఎదుర్కొన్నారు. వీటిని పెద్దగా పట్టించుకోని సుర్జీత్‌ను కాంగ్రెస్ కమ్యూనిస్టు నేతగా ఎంతోమంది అభివర్ణించారు.

అధికారం కోసం ఎన్నడూ పాకులాడని ఈ యోధుడు.. 1992 నుంచి 2005 వరకు నిరంతరాయంగా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నిర్వహించారు. చొరవ, సంప్రదింపుల నైపుణ్యాన్ని కలిగిన సుర్జీత్.. అసాధారణ పరిణితిని కలిగివుండటం ఆయనకే సొంతం. దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొన్నపుడల్లా.. తన ప్రత్యేక పంథాతో సంక్షోభాన్ని పరిష్కరించారు.
1 | 2  >>  
మరిన్ని
స్వాతంత్ర్యమే ఊపిరిగా నరనరాన స్వేచ్ఛాగీతిక
తెలుగు గడ్డపై మహాత్ముడు
ఆ పాట వింటూనే వళ్ళు పులకరిస్తుందిః పీబీ శ్రీనివాస్