|
భారత రాజ్యాంగ నిర్మాత.. అంబేద్కర్
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | డాక్టర్ అంబేద్కర్.. భారత రాజ్యాంగ నిర్మాత. దేశంలో అస్పృశ్య నిర్మూలన కోసం మహోద్యమాన్నే చేపట్టి దేశ వ్యాప్తంగా వున్న దళితుల్లో సాంఘీక, విద్య, రాజకీయ చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా.. భారత జాతీయ సాంఘీకోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్కి విశిష్టమైన స్థానం ఉంది. సమాజంలో మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి, సర్వసమానత్వం కోసం కృషిచేసిన కారణజన్ముడు. 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రంలో "మహర్" అనే హరిజన తెగలో జన్మించిన అంబేద్కర్ చిన్నతనం నుంచే తెలివైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నాడు.
అతని మేధాశక్తికి, సమయస్పూర్తికి ఉపాధ్యాయులు విస్తుపోతుండేవారు. ఇద్దరు ఉపాధ్యాయులు అతనికి కావలసిన పుస్తకాలను, బట్టలను ఉచితంగా ఇచ్చి, అతని బాగా ప్రోత్సాహించారు. ప్రాథమిక విద్య అనంతరం భీమ్ రావ్ 'సతారా' నుంచి బొంబాయికి మకాం మార్చాడు. ఒక సువర్ణ పండితుడి సహకారంతో బొంబాయి ఎలిఫిన్ష్టన్ హై స్కూల్లో చేరాడు. ఆ పండితుడు అతనికి అన్ని విషయాలలోనూ చక్కని సలహాలిస్తూ, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, ఆత్మబలంతో ముందుకుపోవటానికి ప్రోత్సాహమిచ్చారు. ఆయన మీద గౌరవంతో తన పేరును అంబేద్కర్గా మార్చుకున్నాడు.
ఆ రోజుల్లో "అంటరానితనం" ఆయన్ను ఎంతగానే భాధించేది. ఇలాంటి తక్కువ కులంలో పుట్టినందుకు దురదృష్టవంతుడినని ఆయన ఏనాడూ బాధపడలేదు. ఈ వర్ణవ్యవస్థ కేవలం మానవుడు కల్పించినవే, కొందరు స్వార్ధపరులు కల్పించిన ఈ ఆచారాలు ఖండించాలి. అందరిలోనూ ఎర్రని రక్తమే ప్రవహిస్తుంది. ఎక్కువ, తక్కువ అనే భావం మనలో ఉండకూడదు. దీనిని ఒక ఉద్యమంగా చేపట్టాలి! అని మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ అటువంటి కార్యక్రమం చేపట్టాలంటే ముందు చదువు ముఖ్యం. అందుచేత ఉన్నత విద్యనభ్యసించాలి అనుకున్నాడు.
|