ఆ పట్టుదలే అంబేద్కర్ను న్యాయశాస్త్రంలో డాక్టరేట్ పట్టాపుచ్చుకునేలా చేసింది. 1917లో పి.హెచ్.డి. పూర్తిచేసి, అక్కడ నుండి యూరపుఖండంలోని అన్ని ముఖ్య దేశాలు తిరిగి, అక్కడ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశాడు. 1920లో లండన్ వెళ్ళి అక్కడ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ తీసుకొని 1928లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణులై స్వదేశం తిరిగి వచ్చారు. సంఘంలో అస్పృశ్యులనే వారికి సరైన స్థానం లభించాలంటే, "విద్య, సంఘంలో ఆందోళన" అవసరం అని ఉద్భోధించి వారిలో చైతన్యం కలిగించి "బహిష్కృతి హితకారిణి సభ" అనే సంస్థను స్థాపించాడు.
మహాత్మాగాంధీ, అంబేద్కర్ను కలిసి అంటరాని వారి హక్కుల సాధనకై పోరాడుతానని హామీ ఇచ్చారు. ఈ అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతులు కాలేదు. ఆ తర్వాత 1947లో భారతదేశానికి స్యాతంత్ర్యం లభించింది. గాంధీజీ కోరిక మేరకు అంబేద్కర్కు దేశ న్యాయ, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత భారత రాజ్యాంగ పరిషత్తు నియమించిన రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ను అధ్యక్షునిగా నియమించారు.
అదే ఆయన జీవితంలో మహోజ్వల ఘటన చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించి మహత్తరమైన మలుపు రాజ్యాంగ రచనలో హెచ్చుభారాన్ని స్వీకరించి, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా నిర్ణయిస్తూ ఒక సూత్రాన్ని చేర్చారు. సర్వసమానత్వంకోసం కృషి చేసి ముఖ్యంగా దళితుల ఉద్దరణకు పాటు పడిన రాజకీయ విద్యా సాంఘీక రంగాలలో వారికి సమాన హక్కులు కల్పించి వారి పాలిట దైవంగా అవతరించిన ఆ మహావ్యక్తి 1956 డిసెంబరు ఆరో తేదీన పరమదించారు.
|