ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు > సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సింహవాహనంపై ఊరేగుతున్న మలయప్ప స్వామి
తిరుమల వెంకటేశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల మూడవరోజైన శుక్రవారం తిరుమలలో స్వామివారు సింహవాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతున్నారు. దశావతారాల్లో నాలుగోది నరసింహావతారం. ధర్మసంరక్షణార్థమై నరసింహ అవతారాన్ని ధరించిన స్వామి, బ్రహ్మోత్సవాల్లో సింహవాహనంపై ఊరేగడాన్ని భక్తులు విశిష్టంగా భావించడం ప్రతీతి.

అన్నమయ్య కూడా శ్రీవారి సింహవాహన సేవపై ఎన్నో కీర్తనలు గానం చేసిన సంగతి విదితమే. సింహవాహనంపై శ్రీవారు ఊరేగింపును తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు తరలి వచ్చారు.

ఇదిలా ఉండగా, గురువారం రాత్రి శ్రీవారు చిన్నశేష, హంసవాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం ఉదయం మురళీకృష్ణుడిగా ఆలమందలతో చిన్నశేషవాహనంపై వెంకన్న సాక్షాత్కరించి మాడవీధుల్లో ఊరేగిన వైనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. అదేవిధంగా గురువారం రాత్రి మలయప్ప సర్వాలంకరణతో వీణాపాణియై హంసవాహనమెక్కి భక్తకోటికి దర్శనమిచ్చారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
వైభవంగా ముగిసిన ధ్వజారోహణం
యాత్రికుల వసతిపై దృష్టిసారించని తితిదే  
వైభవంగా ముగిసిన అంకురార్పణ
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వెంకన్న బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధం!  
స్వర్ణమయ పథకాన్ని ప్రారంభించనున్న వైఎస్