ప్రధాన పేజి > ఇతరాలు > వెబ్‌దునియా స్పెషల్ 08 > తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు > గోవిందా... గోవిందా... వెంకటరమణా గోవిందా...
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
గోవిందా... గోవిందా... వెంకటరమణా గోవిందా...
WD
తిరుమలలోని శేషగిరి కొండలు అను నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగుతుంటాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి సంరక్షణలో తాము ఉన్నామనే మహత్తర భావనను ప్రతి భక్తుడికీ ఈ గోవింద నామస్మరణ గుర్తు చేస్తూ ఉంటుంది. శ్రీవారి సన్నిధికి వచ్చే లక్షలాది భక్తులు గోవింద నామస్మరణలో మునిగి తేలుతుంటారు. దైవ దర్శనం కోసం గంటల కొద్దీ సమయం వేచి ఉండవలసిన భక్తులకు ఈ గోవింద నామస్మరణం తగు శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. పైగా తిరుపతి నుంచి 9 కిలోమీటర్లు దూరంలో ఉండే ఆలయానికి 3661 మెట్లు ఎక్కి వచ్చే భక్తులకు ఈ గోవింద నామస్మరణమే శక్తిని, దృఢత్వాన్ని ఇచ్చి స్సూర్తి కలిగిస్తూంటుంది.

దక్షిణాదిన పెరుమాళ్‌గా, పశ్చిమాన శ్రీనివాసుడిగా, ఉత్తరాదిన బాలాజీగా శ్రీవారిని భక్తులు పిలుస్తుంటారు. అయితే ప్రాంతాలు వేరైనా భక్తులందరికీ సమస్యలు తీర్చి కష్టాలు కడతేర్చే రక్షకుడిగా శ్రీవారు వెలుగొందుతుంటారు. పెరుమాళ్ లేదా శ్రీవేంకటేశ్వరుడు లేదా మలయప్ప స్వామిగా ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారిని పలు పేర్లతో సేవించే భక్తులకు తిరుమల భూతల స్వర్గంగా ఉంటుంది. కాగా, దేశంలోని భక్తులు తిరుమల గిరిని సాక్షాత్తూ స్వర్గసీమగా భావిస్తుంటారు.

శ్రీవారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాలను అందుకుందామని వచ్చే లక్షలాది భక్తులను పచ్చటి అడవుల మధ్య పాములాగా మెలికలు తిరిగే రహదారులు విపరీతంగా ఆకట్టుకుంటాయి. శ్రీవారిని దర్శించుకుంటే చాలు జన్మ ధన్యమయినట్లేనని చాలామంది భక్తులు భావిస్తుంటారు. కేవలం స్వామివారి దర్శన భాగ్యం కోసమే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల భక్తులు లెక్కకుమించి తిరుమల సందర్శిస్తుంటారు. వీరు గదుల కోసం కాని, ప్రసాదం కోసం కాని ఆశించరని, తమ ఇలవేల్పు దర్శనమాత్ర భాగ్యం కోసమే వీరు పరితపించిపోతూ ఉంటారని తిరుమల ఆలయ ప్రధాన పూజారి రమణ దీక్షితులు తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
1 | 2  >>  
మరిన్ని
గరుడసేవకు ఏడులక్షల మంది భక్తులు?
హనుమంతునిపై మలయప్ప స్వామి విహారం
అత్యంత వైభవంగా శ్రీవారి గరుడోత్సవం  
గరుడ సేవకు భక్తులందరికీ దర్శనం
'మోహిని' అవతారంలో శ్రీనివాసుడు  
సర్వభూపాల వాహనంపై వెంకన్న విహారం